పండుగ రోజున ఇంటికి వస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ...
కడప జిల్లా రైల్వే కోడూరులో దారుణ హత్య కలకలం రేపింది. స్థానిక రంగనాయకులపేటకు చెందిన సాబ్జాన్ -హసీనా దంపతుల కుమారుడు అబ్దుల్ ఖాదర్ బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ..ఈ రోజు రంజాన్ కావడంతో అబ్దుల్ ఖాదర్ నిన్నరాత్రి బెంగుళూరు నుంచి బయలు దేరి ఈ రోజు ఉదయం 5 గంటలకు రైల్వే కోడూరుకు చేరుకున్నాడు. ఇంటికి వెళుతుండగా మార్గ మధ్యంలో కృష్ణ థియేటర్ పక్కన కొందరు దుండగులు ఖాదర్ను కత్తులతో దారుణంగా నరికి చంపారు.
మరోవైపు.. ఖాదర్కు ఈ నెల 23న తన మేనత్త కూతురుతో వివాహం నిశ్చయమైంది. ఎంతో సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకునేందుకు బెంగుళూరు నుంచి వచ్చిన తమ కుమారుడు దారుణ హత్యకు గురికావడంతో తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com