టీచర్ ఉద్యోగాలు.. జీతం రూ.29,000.. అప్లైకి ఆఖరు జూన్ 23
By - TV5 Telugu |20 Jun 2019 5:19 AM GMT
అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. అంగన్వాడీ కేంద్రాలతో కలిసి పూర్వ ప్రాథమిక విద్య (ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్)లో టీచర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు సంగారెడ్డి, నార్త్ ఈస్ట్ కర్ణాటకలోని పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది.
విద్యార్హత: ఏదైనా సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ లేదా డిగ్రీతో పాటు D.ED లేదా B.ED పూర్తి చేసి ఉండాలి. కన్నడ, తెలుగు స్పష్టంగా మాట్లాడగలిగిన వారు అర్హులు. వేతనం: అభ్యర్థులకు నెలకు కనీసం రూ.29 వేల వరకు ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 23,2019.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com