ప్రజావేదిక కూల్చడంతోనే వైసీపీ పతనం ప్రారంభమైంది

సీఎం జగన్ ప్రజాసమస్యలపై కాకుండా టీడీపీ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు, కక్షసాధింపుపైనే దృష్టిసారిస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. పరిష్కారం చేతకాక ప్రతి సమస్యకు టీడీపీపై నెపం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..ప్రజావేదిక కూల్చడంతోనే వైసీపీ పతనం ప్రారంభమైందన్నారు చంద్రబాబు. గుంటూరు పార్టీ కార్యాలయానికి రోజూ వస్తున్నానని...దీనికి కూడా నోటీసులు పంపేలా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వరుస తప్పులతో వైసీపీ నేతలు వాళ్ల గుంతలు వాళ్లే తవ్వుకుంటున్నారని అన్నారు చంద్రబాబు. పార్టీ నేతలతో సమావేశమైన బాబు పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు...

తనను వెంటాడటమే టార్గెట్ గా జగన్ వ్యవహరిస్తున్నారని అన్నారు చంద్రబాబు..పేదలను వేధింపులకు గురిచేసి..దాడులు-దౌర్జన్యాలకు పాల్పడితే పతనం తప్పదని హెచ్చరించారు.. ప్రశాంతంగా ఉండే కుప్పంలోనే బ్యానర్లతో రగడ చేశారని ఆరోపించారు. తన నియోజకవర్గంలోనే ఫ్లెక్సీల ద్వారా ఉద్రిక్తత తెచ్చి ఘర్షణలకు ప్రేరేపించారంటే, ఇక మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఎంటో అర్ధం చేసుకోవచ్చన్నారు. దాడులకు గురైన పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని సీనియర్లకు సూచించారు..చంద్రబాబు

ఇబ్బందుల్లో ఉన్న రైతులకు సంఘీభావం తెలపాలని పార్టీ నేతలకు సూచించారు చంద్రబాబు. అన్నదాత సమస్యల పరిష్కారానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ తరఫున ఒక కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించారు...విత్తనాల కొరత, విద్యుత్ కోతలు, సాగునీటి కొరత, కరవు పరిస్థితులు ఉన్న ప్రాంతాలలో ఆ కమిటీ సభ్యులు పర్యటిస్తారని తెలిపారు..పరిష్కార మార్గాలపై రాబోయే అసెంబ్లీ వేదికగా చర్చిస్తామని తెలిపారు చంద్రబాబు. ఇక వృద్ధిరేటుపై మాట్లాడొద్దని సీఎం జగన్ కు అధికారులకు సూచించడాన్ని ఎలా చూడాలని ప్రశ్నించారు చంద్రబాబు. వృద్ధిరేటును గాలికి వదిలేస్తే పరిశ్రమలు ఏవిధంగా తెస్తారని నిలదీశారు.

Tags

Read MoreRead Less
Next Story