పది పాసైతే రైల్వేలో ఉద్యోగం.. 24 ఏళ్ల లోపు వారు అప్లై.. జులై 25 లాస్ట్ డేట్

పది పాసైతే రైల్వేలో ఉద్యోగం.. 24 ఏళ్ల లోపు వారు అప్లై.. జులై 25 లాస్ట్ డేట్

ఆగ్నేయ మధ్య రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పదవతరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ తప్పనిసరి. 15-24 ఏళ్ల వయసు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వాళ్లు రాయ్‌పూర్ డివిజన్, వేగన్ రిపేర్ షాప్-రాయ్‌పూర్‌లో పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు జులై 25 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం ఖాళీలు: 413.. రాయ్‌పూర్ డివిజన్: 255 ఖాళీలు.. వెల్డర్: 28, టర్నర్: 23, కార్పెంటర్: 23, ఫిట్టర్: 87, ఎలక్ట్రీషియన్: 71, స్టెనోగ్రాఫర్(ఇంగ్లీష్): 02, స్టెనోగ్రాఫర్(హిందీ):02, పెయింటర్: 03, హెచ్ ఎస్ ఇన్‌స్పెక్టర్: 03, కంప్యూటర్ ఆపరేటర్: 05, ఆఫీస్ అసిస్టెంట్: 05, వేగన్ రిపేర్ షాప్-రాయ్‌పూర్: 158, ఫిట్టర్: 69, వెల్డర్: 69, ఎలక్ట్రీషియన్: 09, మెషినిస్ట్: 05, ఎంఎం వెహికల్: 03, టర్నర్: 03.

Tags

Read MoreRead Less
Next Story