ఆ విషయంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న చంద్రబాబు

ఆ విషయంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న చంద్రబాబు

రాజధానిని అమరావతి నుంచి మార్చాలన్న ఉద్దేశంతోనే...ప్రభుత్వం వరద రాజకీయం చేసిందని భావిస్తోంది టీడీపీ. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నపార్టీ అధినేత చంద్రబాబు సర్కారు కుట్రను ప్రజల్లోకి తీసుకెెళ్లాలని నిర్ణయించారు. వరదలు - ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు చంద్రబాబు..

కృష్ణ నది వరదలను ప్రభుత్వం పూర్తిగా రాజకీయం చేసిందన్నది టీడీపీ వాదన. ఈ వరద రాజకీయం వల్లే ప్రజలు ముంపు బారిన పడ్డారని గట్టిగా చెబుతోంది. ఇళ్లు, పొలాల్లోకి నీరు చేరడం వంటి అంశాలను తన ప్రజెంటేషన్‌లో ప్రస్తావించనున్నారు చంద్రబాబు. రాజధాని ప్రాంతమైన అమరావతి గ్రామాలు వరద ముంపునకు గురవుతున్నాయని ఇటీవల వైసీపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. పల్లపుప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తప్పవంటూ లీకులు ఇచ్చారు. ప్రకాశం బ్యారేజ్‌లో సామర్థ్యానికి మించి నీటిని నిల్వచేయడం ద్వారా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేసిందని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ విషయాలన్నింటినీ తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరించనున్నారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story