భర్త సింగపూర్‌లో.. భార్య టిక్‌టాక్ ఫ్రెండ్‌కి దగ్గరై..

భర్త సింగపూర్‌లో.. భార్య టిక్‌టాక్ ఫ్రెండ్‌కి దగ్గరై..

ఉద్యోగం, ఉపాధి పేరుతో భర్తలు దూరంగా.. భార్యలు మరో ప్రపంచంలో. టెక్నాలజీని తెగ వాడేస్తున్నారు. వాట్సాప్‌లు, ఫేస్‌బుక్‌లు దాటి ఇప్పుడు టిక్‌టాక్ జోరు నడుస్తోంది. అతి అనర్ధానికి దారితీస్తుంది. సరదాగా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. అదే శృతి మించితే పర్యవసానం ఇలానే ఉంటుంది. టిక్‌టాక్ వ్యసనానికి బానిపై ఎన్నో కుటుంబాలు బలవుతున్నాయి. తాజాగా ఓ వివాహిత టిక్‌టాక్ ఫ్రెండ్‌తో పరిచయాన్ని పెంచుకుని ఆమెతోనే ఉడాయించింది. తమిళనాడు శివగంగై జిల్లా సానా ఊరణికి చెందిన లియోకు ఈ ఏడాది జనవరిలో వినీత అనే యువతితో వివాహమైంది. లియో ఉద్యోగం నిమిత్తం పెళ్లైన 45 రోజులకే సింగపూర్ వెళ్లిపోయాడు.

ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న వినీత టిక్‌టాక్‌కు బానిసైంది. పొద్దున్న లేస్తే మొబైల్ చేతిలోనే. తల్లి దండ్రులు, అత్తమామలు మందలించినా వినీత తన ధోరణి మార్చుకోలేదు. అభి అనే యువతితో పరిచయాన్ని పెంచుకుంది వినీత టిక్‌టాక్ చేస్తూ. వీరిద్దరి పరిచయం స్వలింగ సంపర్కానికి దారితీసింది. పెద్దలకు తెలియకుండా చాటు మాటుగా రాసలీలలు సాగించేవారు. వీరిద్దరూ చనువుగా ఉన్న వీడియోలు తీసి పోస్ట్ చేసేవారు. వాటిని చూసిన లియో భార్యను మందలించినా ఆమె పట్టించుకోలేదు. అభి ఫోటోను వినీత తన భుజంపై టాటూ వేయించుకునేదాకా దారి తీసింది వారి పరిచయం.

ఇక లాభం లేదని విషయం ఏంటో తేల్చుకుందామని లియో సింగపూర్‌ నుంచి వచ్చాడు. బీరువాలో ఉన్న 20 తులాల బంగారం మాయమైంది. ఏమైంది అని వినీతను అడిగితే తెలియదు అని సమాధానం చెబుతుంది. ఇంట్లో ఉన్న గిప్ట్‌లు చూసి ఎక్కడవని అంటే అభి ఇచ్చిందని తెలిపింది. లియో భార్యను తీసుకుని పుట్టింటికి వెళ్లి విషయం వివరించి అక్కడే వదిలేసి వచ్చాడు. ఈ నెల 19న వినీత పుట్టింట్లో నుంచి ప్రేమించిన టిక్‌టాక్ ప్రియురాలు అభితో జంప్ అయ్యింది. దీంతో వినీత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఆమె అభితో పరారైనట్లు తేలింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని వారి కోసం గాలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story