మిషన్ భగీరథ పథకాన్ని ప్రశంసించిన గవర్నర్ తమిళిసై

X
By - TV5 Telugu |18 Dec 2019 3:34 PM IST
స్వచ్ఛ భారత్ కార్యక్రమం దేశంలో ఎంతో మార్పు తెస్తోందని అన్నారు గవర్నర్ తమిళిసై. అయితే పారిశుద్ధ్యంపై ప్రజలను ఇంకా పూర్తిస్థాయిలో చైతన్యం చేయలేకపోతున్నామని చెప్పారు. మురుగునీటిని శుద్ధి చేసి వినియోగంలోకి తెస్తే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందివ్వొచ్చని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మిషన్ భగీరథ పథకాన్ని గవర్నర్ అభినందించారు. రాజేంద్రనగర్లో యూనిసెఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తమిళిసై పాల్గొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com