పది, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు 'ఎల్‌ఐసీ' స్కాలర్‌షిప్.. అప్లై ఇలా..

పది, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఎల్‌ఐసీ స్కాలర్‌షిప్.. అప్లై ఇలా..

lic-scholarship

ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఉన్నత విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులకు ఎల్‌ఐసీ స్కాలర్ షిప్ అందిస్తోంది. భారత ప్రభుత్వానికి చెందిన బీమా సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC అనుబంధ సంస్థ అయిన ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ LIC HFL విద్యార్థలుకు పై చదువులు చదువుకునే వెసులు బాటు కల్పిస్తుంది. ఎల్‌ఐసీ హెచ్ఎఫ్ఎల్ విద్యాదాన్ స్కాలర్‌షిప్ పేరుతో 8వ తరగతి నుంచి పీజీ విద్యార్థుల వరకు అందరికీ రూ.30,000 వరకు స్కాలర్‌షిప్ అందిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లైకి ఆఖరు డిసెంబర్ 31. 8నుంచి 10వ తరగతి విద్యార్థులు అప్లై చేసుకునేటట్లయితే ముందు తరగతిలో వచ్చిన పర్సంటేజ్ 65% ఉండాలి, వార్షికంగా రూ.10,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఇక ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, పాలిటెక్నిక్ విద్యార్థులు దరఖాస్తు చేయాలంటే 10వ తరగతిలో 65% మార్కులతో పాస్ కావాలి. వీరికి వార్షికంగా రూ.15,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది. డిగ్రీ చదివే విద్యార్థులకు 12వ తరగతిలో 65% మార్కులు ఉంటే రూ.20,000, పీజీ విద్యార్థులకు రూ.30,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది.

గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో చదువుతున్న వారు మాత్రమే స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్ధుల కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షల లోపు ఉండాలి. దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా ఎల్‌ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ http://www.lichousing.com ఓపెన్ చేయాలి. హోమ్‌పేజీలో కనిపించే విద్యాదాన్ స్కాలర్‌షిప్ పేజీ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే Buddy4Study పేరుతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. వేర్వేరు తరగతులకు వేర్వేరు లింక్స్ కనిపిస్తాయి. చదువుతున్న తరగతిని బట్టి దరఖాస్తు లింక్‌పై క్లిక్ చేయాలి. వివరాలన్ని సరిగా ఎంటర్ చేసి స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఫోటో ఐడీఫ్రూఫ్, అడ్మిషన్ ఫ్రూఫ్, విద్యా సంవత్సరం ఫీజు వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఆర్థిక అవసరాలు, మెరిట్‌ను బట్టి స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు. తల్లి లేదా తండ్రి లేని వారికి, అనాధలకు, తల్లిదండ్రుల పరిస్థితి బాగాలేని వారికి, ఉపాధి లేని కుటుంబాలకు చెందిన పిల్లలకు ప్రాధాన్యం ఉంటుంది. విద్యార్థులు టెలిఫోన్ ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. ఆ తరువాత అవసరాన్ని బట్టి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేస్తారు. ఇవన్నీ పూర్తయిన తరువాతే విద్యార్థులను స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు.

Read MoreRead Less
Next Story