కేంద్రం మెడలు వంచుతా అన్న జగన్ ఇప్పుడు మాట్లాడటం లేదు: తులసిరెడ్డి
By - TV5 Telugu |28 Dec 2019 9:25 AM GMT
జగన్ పాలన పిచ్చి తుగ్లక్ పాలనను తలపిస్తుందన్నారు ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి. ఒక్క రాజధానికే దిక్కులేని పరిస్థితి ఉంటే.. మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారో అర్థం కావడం లేదన్నారు. ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి విభజన హామీలు సాధిస్తామన్న వైసీపీ నేతలు.. ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. స్వయాన ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతిని మార్చడం సరికాదన్నారు తులసిరెడ్డి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com