సీఎంకు ఎందుకు అంత భయం?: అమరావతి రైతులు

X
By - TV5 Telugu |7 Jan 2020 11:28 AM IST
అమరావతి గ్రామాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రైతుల ధర్నాలను పోలీసులు అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అటు మందడంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రహదారిపైకి రాకుండా వీధుల్లో కంచె వేయడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల సహకారం అంటే కంచెలు వేసి ఎవరూ బయటకు రాకుండా చేయడమేనా అని ప్రశ్నిస్తున్నారు. మందుల దుకాణాలు, పీహెచ్ఎసీలు కూడా తెరవనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లో కంచె వేసి సచివాలయానికి వెళ్లేంత భయం ముఖ్యమంత్రికి ఎందుకని రాజధాని రైతులు నిలదీస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com