ప్రజలు పోవాలి జగన్ అంటున్నారు: నారా లోకేష్

X
By - TV5 Telugu |9 Jan 2020 5:33 PM IST
సీఎం జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. పసిబిడ్డ అమరావతిని 3 ముక్కలుగా నరికేస్తున్నారని విమర్శించారు. ఆందోళన చేస్తున్న రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటారా అని వైసీపీ నేతలను నిలదీశారు.11 మంది రైతులు చనిపోతే ఒక్కరు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రజలంతా పోవాలి జగన్.. వద్దు జగన్ అంటున్నారని అన్నారు లోకేష్. మందడంలో రాజధాని రైతుల చేస్తున్న మహాధర్నా శిబిరాన్ని సందర్శించిన లోకేష్ వారికి సంఘీభావం తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com