ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చే వరకు పోరాడుతాం: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చే వరకు పోరాడుతాం: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

ram

స్వర్గీయ ఎన్టీఆర్‌ స్ఫూర్తితో తెలుగు జాతి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా.. శ్రీకాకుళం పట్టణంలో టీడీపీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. రాజకీయాల్లో సోషలిజం కాన్సెప్ట్‌తో విప్లవాత్మక మార్పులు తెచ్చిన నాయుడు ఎన్టీఆర్‌ అని రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రత్యేక హోదా అంటూ.. ఎన్నికల్లో వెళ్లిన వైసీపీ నేతలు.. అధికారంలోకి రాగానే దాన్ని మరచిపోయారని ఆయన విమర్శించారు. బ్రిటిష్‌ వారిని మరిపించే విధంగా జగన్‌ విభజించి పాలించు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చే వరకు టీడీపీ ఎంపీలు పోరాడుతూనే ఉంటారని స్పష్టం చేశారాయన.

Tags

Read MoreRead Less
Next Story