నేను ఒక్క సైగ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది: బాలకృష్ణ

X
By - TV5 Telugu |31 Jan 2020 8:11 PM IST
చట్టంపై మాకు గౌరవం ఉంది కాబట్టే మౌనంగా ఉన్నామని.. మౌనాన్ని చేతగానితనం అనుకోవద్దని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఘాటుగా వ్యాఖ్యానించారు. గురువారం హిందూపురంలో వైసీపీ కార్యకర్తలు తన కారును అడ్డుకోవడంపై బాలకృష్ణ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తాను ఒక్క సైగ చేసి ఉంటే పరిస్థితి ఎక్కడికి దారితీసేదని అన్నారు. మంత్రులకు అవగాహన లేక అసెంబ్లీలో గొడపడుతున్నారని.. కక్ష సాధింపు చర్యలతో రాష్ట్ర అభివృద్ధి కుంటు పడుతుందని బాలకృష్ణ అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com