సీఎం జగన్‌కు చంద్రబాబు మీద పగ తప్ప ఇంకేమీ కనిపించడం లేదు: బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

సీఎం జగన్‌కు చంద్రబాబు మీద పగ తప్ప ఇంకేమీ కనిపించడం లేదు: బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

సీఎం జగన్‌కు చంద్రబాబు మీద పగతప్ప ఇంకేమీ కనిపించడం లేదని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి విమర్శించారు. కర్నూల్‌, కడప జిల్లాలకు సాగు, తాగు నీరు అందించే కేసీ కెనాల్‌కు నీరు ఇవ్వాలని కోరుతూ రైతులతో కలిసి కర్నూల్‌ ఇరిగేషన్‌ SE కార్యాలయాన్ని ముట్టడించారు. జగన్‌.. చంద్రబాబు మీద పగతో రైతులను రోడ్డుకు ఈడ్చి.. ప్రజలను అష్టకష్టాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రైతుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్‌కు రైతుల సమస్యలు కనిపించడం లేదా అంటూ బైరెడ్డి ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story