3 రాజధానుల సలహా సీఎంకు ఎవరిచ్చారో అర్థం కావటంలేదు: సీపీఐ రాజా
By - TV5 Telugu |21 Feb 2020 12:41 PM GMT
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా డిమాండ్ చేశారు. 3 రాజధానులు లాంటి సలహాలు సీఎంకు ఎవరు ఇస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. జగన్ తీరు కారణంగా ఏపీ అభివృద్ధి ఆందోళనకరంగా మారిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్కు తాము పూర్తి మద్దతిస్తున్నామని.. కేంద్రంతో ఈ విషయంపై జగన్ పోరాడాలని రాజా అన్నారు. విజయవాడ వచ్చిన ఆయన్ను అమరావతి జేఏసీ ప్రతినిధులు కలిసారు. 29 గ్రామాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్ని ఆయన దృష్టికి తెచ్చారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com