ఎన్‌కౌంటర్ చేసినా.. వెనక్కి వెళ్లేది లేదు: చంద్రబాబు

ఎన్‌కౌంటర్ చేసినా.. వెనక్కి వెళ్లేది లేదు: చంద్రబాబు

విశాఖ ఎయిర్‌పోర్ట్‌ దగ్గర పోలీసులు టీడీపీ అధినేత చంద్రబాబును నిర్బంధించారు. వైసీపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఎట్టిపరిస్థితుల్లోనూ యాత్ర కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఎన్‌కౌంటర్ చేసినా వెనక్కి వెళ్లేదిలేదని తేల్చిచెప్పారు. పోలీసులు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ గూండాలు తనను అడ్డుకుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఇది శాంతి భద్రతల వైఫల్యం కాదా అని ప్రశ్నించారు చంద్రబాబు. వైసీపీ గూండాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఫైర్ అయ్యారు. అన్ని అనుమతులు ఉన్నా యాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు.

ప్రజల కష్టాలు విన్న తర్వాతే వెనక్కి వెళ్తానని స్పష్టం చేశారు చంద్రబాబు. పక్కా ప్లాన్‌తో తనను అడ్డుకున్నారని ఆరోపించారు. వైసీపీ డబ్బులిచ్చి మనుషుల్ని తీసుకొచ్చి గూండాగిరి చేయిస్తోందని అన్నారు. పెయిడ్‌ ఆర్టిస్టులతో రాళ్లు, కోడుగుడ్లు వేయించారని ఫైరయ్యారు. తన జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది మండిపడ్డారు. వైసీపీ నేతల బండారం బయటపడుతుందనే తన యాత్రను అడ్డుకుంటున్నారని ఆరోపించారు చంద్రబాబు

Tags

Read MoreRead Less
Next Story