మద్యం పంచకూడదనే నిబంధనలకు తూట్లు పొడుస్తున్న వైసీపీ అభ్యర్థులు

మద్యం పంచకూడదనే నిబంధనలకు తూట్లు పొడుస్తున్న వైసీపీ అభ్యర్థులు

మద్యం, ధన ప్రవాహం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్న వైసీపీ ప్రభుత్వ హామీలను.. వారి పార్టీ నేతలే తూట్లు పొడుస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు.. వైసీపీ నేతలు పెద్ద ఎత్తున మద్యం స్టాక్‌ను అరేంజ్‌ చేసుకున్నారు. ఏకంగా పోస్టాఫీస్‌నే మద్యం గోడౌన్‌గా మార్చారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని 16 కేసుల మద్యాన్ని నిల్వ ఉంచారు వైసీపీ నాయకులు. విషయం తెలసుకుని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రెయిడ్‌ చేసి మద్యం స్టాక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేసే లోకేష్‌ అనే వ్యక్తి.. మద్యం స్టాక్‌ను పోస్ట్‌ ఆఫీస్‌లో పెట్టినట్టు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story