కడప జిల్లాలో విపక్ష అభ్యర్థులపై వైసీపీ శ్రేణులు ముప్పేటదాడి
ఓ వైపు పోలీసుల ద్వారా బెదిరింపులు.. మరోవైపు విపక్ష పార్టీల అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరిస్తున్న ఎన్నికల అధికారులు.. ఇంకో వైపు అధికార బలంతో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులపై వైసీపీ శ్రేణుల దాడులు.. మొత్తంగా స్థానిక సమరం కడప జిల్లాలో రాజకీయ సెగలు రగుల్చుతోంది. నామినేషన్ల దాఖలు చివరి రోజు కూడా టీడీపీ అభ్యర్థులపై ముప్పేట దాడి జరిగింది. కడప జిల్లా రాయచోటి మున్సిపల్ ఎన్నికల కోసం నామినేషన్లు వేసేందుకు వెళ్లిన టీడీపీకి చెందిన అభ్యర్ధులపై వైసీపీ నాయకులు దాడులకు తెగబడ్డారు.
మాజీ మార్కెట్ ఛైర్మన్, టీడీపీ అదికార ప్రతినిధి గాజుల ఖాదర్ భాషాపైనా దాడి జరిగింది. కొందరు వైసీపీ నాయకులు టీడీపీ అభ్యర్ధుల చేతిలోని నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేసి భయానక వాతావరణం సృష్టించారు. వైసీపీ నాయకుల దాడిలో గాయపడ్డ ఖాదర్భాషా.. టీడీపీ జిల్లా అధ్యక్షుడితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. తమపై కూడా దాడి జరిగిందంటూ కొంతమంది వైసీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com