తాత్కాలిక కూరగాయల మార్కెట్లను సందర్శించిన మంత్రి హరీష్ రావు

X
By - TV5 Telugu |27 March 2020 12:52 AM IST
లాక్ డౌన్ నేపథ్యంలో సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన.. తాత్కాలిక కూరగాయల మార్కెట్ ను సందర్శించారు మంత్రి హరీష్ రావు. సరుకుల రవాణా ఆగిపోవడంతో పట్టణాల్లో కూరగాయల ధరలు పెరిగినా.. గ్రామీణ ప్రాంతాల్లో తగ్గాయని అన్నారు. ధరలు తగ్గిపోవడంతో రైతులు కూరగాయలను పారబోతున్నారని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి ఒక రైతు, ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఏర్పాటు చేసి కూరగాయలను బోయిన్ పల్లి మార్కెట్ తరలించే ఏర్పాటు చేస్తామని అన్నారు హరీష్ రావు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com