ఏపీ ఉద్యోగులకి రెండు విడతల్లో జీతాలు

X
By - TV5 Telugu |31 March 2020 11:05 PM IST
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను రెండు విడతల్లో చెల్లిస్తామని ఏపీ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. సీఎం జగన్ తో జరిగిన భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడిందని.. అందుకే ఈ నెలలో సగం వేతనం చెల్లిస్తామని, నిధులు సమకూరిన తరువాత మిగతా సగం చెల్లిస్తామని సీఎం చెప్పారని ఆయన చెప్పారు. ఈ ఆపత్కాల పరిస్థితిలో రెండు విడతలుగా జీతం తీసుకునేందుకు ఒప్పుకున్నామని సూర్యనారాయణ పేర్కొన్నారు. ఈ ఒక్క నెల మాత్రమే రెండు విడతల్లో చెల్లిస్తామని సీఎం చెప్పారన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com