మాపై వివక్ష చూపొద్దు: మోదీకి మిజోరాం సీఎం విజ్ఞప్తి

మాపై వివక్ష చూపొద్దు: మోదీకి మిజోరాం సీఎం విజ్ఞప్తి

కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా అలజడులు సృష్టిస్తుంది. కేరళ, కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాలలో పరిస్థితి తీవ్రంగా ఉంది. అయితే.. కరోనా చైనాలో పుట్టిందని ప్రపంచం మొత్తం కోడై కూస్తుంది. ఈ నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై దేశంలో పలుచోట్ల జాతివివక్ష చూపుతున్నారు. వారిని చైనా వాళ్లంటూ దూషిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో ఓ మిజోరాం యువతిపై ఉమ్మి వేసిన ఘటన కలకలం సృష్టించింది. అటు.. మైసూరులో ఓ ఈశాన్య రాష్ట్రానికి చెందిన వ్యక్తిని మార్కెట్లోకి అనుమటించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మిజోరాం సీఎం జోరాంథంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. తమ ప్రాంత ప్రజలపై జాతివివక్ష జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని కోరారు. ఈ వీడియో చుస్తే.. చాలా బాధ కలుగుతుందని.. మానవత్వం ఇంత దిగజారిపోయిందా? అని ట్వీట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story