ఒక ఏడాది జీతం విరాళంగా ఇచ్చిన కర్ణాటక సీఎం

ఒక ఏడాది జీతం విరాళంగా ఇచ్చిన కర్ణాటక సీఎం

కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్ యెడియూరప్ప కరోనా కట్టడికి ఒక సంవత్సరం జీతం విరాళంగా ఇచ్చారు. బుధవారం ఈ మేరకు ట్విట్టర్ లో తెలిపిన యెడియూరప్ప.. మనమంతా కలిసి కరోనాపై పోరాటం చేయాలని కర్ణాటక ప్రజలకు పిలుపునిచ్చారు. నేను నా ఒక సంవత్సర జీతాన్ని సీఎంఆర్ఎఫ్ కోవిడ్ 19 కి విరాళంగా ఇస్తున్నానని.. కరోనా కట్టడి కోసం మీ వంతు మీరు సాయం చేయాలనీ అభ్యర్థిస్తున్నానని ట్వీట్ లో పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు,శాసనసభ్యులు, అధికారులు, ప్రజలు ముందుకువచ్చి వారి వారి స్థాయిని బట్టి కరోనా సీఎం సహాయనిధికి విరాళాలు అందించాలని సీఎం యెడియూరప్ప కోరారు.

Tags

Read MoreRead Less
Next Story