కరోనాపై ఫేక్ న్యూస్ కట్టడికి ట్విట్టర్ అకౌంట్
By - TV5 Telugu |1 April 2020 3:09 PM GMT
కరోనాపై వస్తున్న ఫేక్ న్యూస్ ను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఓ ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించింది. ‘హ్యాష్ ట్యాగ్ ఇండియా ఫైట్స్ కరోనా’ అనే పేరుతో ఉన్న అకౌంట్ ద్వారా సమాచారమందిస్తామని తెలిపింది. కరోనాపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుపుతామని తన తొలి ట్వీట్ ద్వారా చెప్పింది. @CovidnewsbyMB పేరుతో దీని వివరాలు అందనున్నాయి. అంతేగాక 24 గంటలు పని చేసే హెల్ప్ లైన్ నంబర్ కూడా ఇచ్చింది. దేశవ్యాప్తంగా 1074 టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చారు. దీనితో ఫేక్ న్యూస్ కు అవకాశం ఉండదు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com