తమిళనాడులో ఒకే రోజు 110 కరోనా కేసులు

తమిళనాడులో ఒకే రోజు 110 కరోనా కేసులు

కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 157 దేశాలకు ఈ మహమ్మారి వ్యాపించింది. ఇండియాలో కూడా కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇక తమిళనాడులో కరోనా స్వైర విహారం చేస్తోంది. తమిళనాడులో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కరోజే భారీగా పెరిగింది. బుధవారం ఒక్కరోజే 110 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వీరంతా దిల్లీలో మతపరమైన కార్యక్రమానికి హాజరై వచ్చిన వారేనని తెలిపింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 234కు చేరింది.

Tags

Read MoreRead Less
Next Story