కరోనా కట్టడికి రెండేళ్ల జీతం విరాళంగా ఇచ్చిన మాజీ క్రికెటర్

కరోనా కట్టడికి రెండేళ్ల జీతం విరాళంగా ఇచ్చిన మాజీ క్రికెటర్

కరోనా మహమ్మారికి ముక్కు తాడు వేయడానికి పలువురు ప్రముఖులు విరాళాలు సమర్పించారు. తాజాగా భారత మాజీ క్రికెటర్, బీజీపీ ఎంపి గౌతమ్ గంభీర్ తన రెండేళ్ల జీతాన్ని ప్రధాని రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ప్రకటించారు. ప్రతిఒక్కరూ కరోనా కట్టడికి చేయూతనివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశం మన కోసం ఏమి చేసిందని చాలామంది అడుగుతారని.. అయితే దేశం కోసం మనం ఏమి చేయవచ్చు అనే ఆలోచనతో నేను నా రెండేళ్ల జీతాన్ని పీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నానని గంభీర్ ట్విట్టర్‌లో తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story