బ్రేకింగ్.. 10 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందికి కరోనా పాజిటివ్

X
By - TV5 Telugu |4 April 2020 4:47 AM IST
మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముంబై విమానాశ్రయంలో విధులు నిర్వర్తించిన 10 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లు కరోనా బారిన పడ్డారు. విమానాల రాకపోకలపై నిషేధం విధించక ముందు ముంబై విమానాశ్రయానికి వివిధ దేశాల నుంచి భారీగా రాకపోకలు సాగించారు. దీంతో ముందు జాగ్రత్తగా 142 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లను గత కొద్ది రోజులుగా క్వారంటైన్లో ఉంచారు. వీరిలో నలుగురికి గురువారం పాజిటివ్ రాగా.. మిగతా వారికి శుక్రవారం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో వారందరినీ ఐసోలైషన్లో ఉంచారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com