187 ఏళ్ల నాటి అమృతాంజన్ బ్రిడ్జి కూల్చివేతకు ఆదేశాలు
By - TV5 Telugu |3 April 2020 9:21 PM GMT
ముంబైలో అతిపురాతనమైన బ్రిడ్జిని కూల్చివేసేందుకు అధికారులు ఆదేశాలు జారీచేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజారవాణా స్తంభించటంతో ఈ పనులు చేపట్టాలని సర్కార్ నిర్ణయించింది. లోనావాలాకు సమీపంలో ముంబై-పూణే ప్రాంతాలను కలుపుతూ ఉండే అమృతాంజన్ బ్రిడ్జి ని 1830లో నిర్మించారు. పురాతనమైన ఈ బ్రిడ్జి అనేక ప్రమాదాలకు కారణమవుతుండటంతో.. సర్కార్ కూల్చివేయాలని నిర్ణయించింది. మహారాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థకు ఏప్రిల్ 4 నుంచి 14 మధ్య బ్రిడ్జి కూల్చివేతకు రాయ్గఢ్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేసినట్లు అధికారులు వెల్లడించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com