జమాతీలను పట్టుకున్న పోలీసులకు రివార్డు

జమాతీలను పట్టుకున్న పోలీసులకు రివార్డు

తబ్లీగీ జమాత్‌‌లో పాల్గొన్న వారిని పట్టుకున్న పోలీసులకు ఉత్తరాఖండ్‌ సర్కార్ భారీ రివార్డు ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్ డైరెక్టర్‌ జనరల్‌ అశోక్‌కుమార్‌ వారికి రూ.20 వేల రివార్డును ప్రకటించారు.

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జరిగిన జమాత్‌ కార్యక్రమంలో పాల్గొన్న 13 మందిని ఉత్తరాఖండ్‌ పోలీసులు పట్టుకున్నారు. వారందరిపై కేసు నమోదు చేశారు. అనంతరం వారిని క్వారంటైన్‌కు పంపించినట్లు తెలిపారు. ఆ 13 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వెల్లడించారు. కరోనా బాధితులను పట్టుకున్న పోలీసులకు రూ.20 వేల నగదును ఇవ్వనున్నట్లు డైరెక్టర్‌ జనరల్‌ అశోక్‌ కుమార్‌ పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story