మహారాష్ట్రలో 700లకు చేరుకుంటున్న కరోనా పాజిటివ్ కేసులు

మహారాష్ట్రలో 700లకు చేరుకుంటున్న కరోనా పాజిటివ్ కేసులు

మహారాష్ట్రలో కరోనా వేగం క్షణాల్లో పెరుగుతుంది. ఆదివారం ఒక్కరోజే 29 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ కరోనా సోకిన వారి సంఖ్య 690కి చేరుకుంది. అయితే.. ముంబై మహానగరంలోనే 406 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. మరోవైపు.. కరోనా వైరస్ నుంచి కోలుకున్న 56 మందిని డిశ్చార్జ్ చేసినట్టు పేర్కొన్నారు.

అటు నవీ ముంబైలోని కరోనాను వ్యాపిస్తున్నారన్న ఆరోపణలపై 10 మంది ఫిలిప్పీన్స్ జాతీయులను పోలీసులు అరెస్ట్ చేసి.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిలో ఒకరు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story