కేంద్రం కీలక నిర్ణయం.. ఎంపీల వేతనాల్లో 30% కోత

కేంద్రం కీలక నిర్ణయం.. ఎంపీల వేతనాల్లో 30% కోత

కరోనా మహమ్మారి కట్టడి చేసేందుకు మోదీ సర్కారు లాక్‌డౌన్ విధించి అమలు చేస్తోంది. దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. కరోనా వైరస్‌పై పోరాటంలో నిధులను సమకూర్చుకునే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు సహా పార్లమెంటు సభ్యులందరి వేతనంలో సంవత్సరం పాటు 30% కోత విధిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌కు సోమవారం కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సంఘటిత నిధిలో చేరే ఈ మొత్తాన్ని కరోనాపై పోరాటంలో వినియోగించనున్నారు. ఈ మేరకు ‘శాలరీ, అలవెన్సెస్‌ అండ్‌ పెన్షన్‌ ఆఫ్‌ మెంబర్స్‌ ఆఫ్‌ పార్లమెంట్‌ యాక్ట్‌–1954’కు సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ రూపొందించామని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వెల్లడించారు.

ఈ ఆర్డినెన్స్ ప్రకారం ఏప్రిల్ 1 నుంచి ఏడాదిపాటు ఎంపీల జీతాలు, అలవెన్స్‌లు, మాజీ ఎంపీల పెన్షన్లను 30 శాతం తగ్గించారు. ఈ ఆర్డినెన్స్‌తోపాటు ప్రధాని, మంత్రులతోపాటు.. ఎంపీలు, ఎమ్మెల్యేల వేతనాల్లోనూ కోత పడనుంది.

కాగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు కూడా తమ వేతనాలను 30 శాతం మేర తగ్గించుకోవాలని స్వచ్ఛందంగా నిర్ణయించారు. ఈ సేవింగ్స్ మొత్తాన్ని కోవిడ్‌పై పోరాటానికి ఫండ్‌ కోసం మళ్లించనున్నారు. ఎంపీల్యాడ్స్‌ను రెండేళ్లపాటు సస్పెండ్ చేసి.. ఆ మొత్తాన్ని కూడా ఫండ్‌కు మళ్లిస్తారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల మొత్తం రూ.7,900 కోట్లు అవుతుందని.. ఈ మొత్తాన్ని కరోనాపై పోరాటం కోసం కన్సాలిడేటెడ్ ఫండ్‌కు మళ్లిస్తామని ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story