స్వదేశానికి చేరిన 444 మంది ఆస్ట్రేలియా వాసులు
ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సేవలు కూడా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఎక్కడికక్కడే ఉండిపోయారు. ఈ సమయంలో భారత్ లో చిక్కుకుపోయిన విదేశీయులను దగ్గరుండి మరీ తమ స్వదేశానికి పంపుతోంది ఇండియా. ఈ నేఫథ్యంలో లాక్ డౌన్ తో ఇండియాలో చిక్కుకుపోయిన ఆస్ట్రేలియా వాసులు సురక్షితంగా స్వదేశానికి బయలుదేరారు. 444 మంది ఆస్ట్రేలియా వాసులు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మెల్ బోర్న్ కు వెళ్లారు. సిమన్ క్విన్ గ్రూప్ సౌజన్యంతో తమ పౌరులను స్వదేశానికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసినట్లు భారత్ లోని ఆస్ట్రేలియా రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com