రాజస్థాన్లో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజులోనే 117 పాజిటివ్ కేసులు

X
By - TV5 Telugu |12 April 2020 2:16 AM IST
రాజస్థాన్ లో కరోనా విరుచుకుపడుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 678కు చేరిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే కొత్తగా నమోదైన కేసుల్లో 65 కేసులు రాష్ట్ర రాజధాని జైపూర్ లోనే గుర్తించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. తాజా కేసులను కలుపుకొని జైపూర్ 286 మంది కరోనా బారిన పడ్డాఋ. అయితే ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 23000 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, ఇంకా కొందరి రిపోర్టులు రావలసి ఉందని ప్రభుత్వం తెలిపింది.అటు.. సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ కరోనా కారణంగా మరణించిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి 50 లక్షల రూపాయలు అందజేయనున్నట్లు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com