నిబంధనలు ఉల్లంఘిస్తే ఏప్రిల్ 30 తరువాత కూడా లాక్డౌన్ పొడిగిస్తాం: ఉద్ధవ్ ఠాక్రే
By - TV5 Telugu |11 April 2020 8:32 PM GMT
ఏప్రిల్ 30 వరకూ మహారాష్ట్రలో లాక్డౌన్ కొనసాగుతుందని ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. ముంబై, పుణె నగరాల్లో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పర్గతంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు నగరాల్లో కరోనా కట్టడికి మరిన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు.
మహారాష్ట్రలో కరోనా కేసులు గణనీయంగా పెరగటంతో ఉద్దవ్.. రాష్ట్ర ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మహమ్మారిని అదుపు చేయాలంటే అందరూ లాక్డౌన్ పాటించాలని అన్నారు. ఏప్రిల్ 30 వరకూ లాక్డౌన్ కొనసాగుతుందని.. ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా.. ఏప్రిల్ 30 తర్వాత కూడా పొడిగిస్తామని ఆయన హెచ్చరించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com