బుధవారం కేంద్ర మంత్రులతో భేటీ కానున్న ప్రధాని మోదీ

బుధవారం కేంద్ర మంత్రులతో భేటీ కానున్న ప్రధాని మోదీ

ప్రధాన మోదీ నివాసంలో బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. కరోనాను నియంత్రించేందుకు మరో 19 రోజులు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్టు మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మోదీ జాతినుద్ధేశించి ప్రసంగించిన తరువాత ఏర్పాటు కానున్న మంత్రివర్గం సమావేశానికి ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై పలు రకాల చర్చలు తెర పైకి వస్తున్నాయి. కరోనా ప్రభావం లేని ప్రదేశాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలను కొన్ని మినహాయిపులు ఇచ్చే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. బుధవారం జరగనున్న మంత్రివర్గం సమావేశంలో ప్రధానంగా ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

అటు దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 10,363 కరోనా కేసులు నమోదయ్యాయని 339 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది

Tags

Read MoreRead Less
Next Story