కరోనాతో మృతి చెందిన అమెరికా యుద్ధనౌకలోని నావికుడు

X
TV5 Telugu13 April 2020 10:14 PM GMT
అమెరికా యుద్ధ నౌక థియోడర్ రూజ్వెల్ట్లో పనిచేస్తున్న నేవీ ఉద్యోగి ఒకరు కరోనా వైరస్తో కన్నుమూశారు. గువామ్లోని ఇంటెన్సివ్ కేర్లో చికిత్స పొందుతున్న అతను సోమవారం తుదిశ్వాస విడిచినట్లు అధికారులు చెప్పారు. యుద్దనౌక థియోడర్లో సుమారు 4 వేల మంది సిబ్బంది ఉన్నారు. అయితే నౌకలో ఉన్న వంద మందికి కరోనా సోకినట్లు కెప్టెన్ అమెరికా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ నౌకకు డాకింగ్ ఏర్పాటు చేయాలని ఆయన తన లేఖలో కోరాడు. యుద్ధ నౌక కెప్టెన్ తన లేఖను మీడియాకు రిలీజ్ చేసిన కారణంగా.. అతన్ని పెంటగాన్ సస్పెండ్ చేసింది.
Next Story