ప్రొఫైల్ పిక్ మార్చిన ప్రధాని మోదీ

ప్రొఫైల్ పిక్ మార్చిన ప్రధాని మోదీ

ప్రధాని మోదీ తన ట్విటర్‌ ప్రొఫైల్‌ ఫోటోను మంగళవారం ఉదయం మార్చారు. ఇందులో విశేషం ఏముంది అనుకోకండి. ఏప్రిల్ 14న ఉద‌యం జాతిని ఉద్దేశించి మాట్లాడే స‌మ‌యంలో మోదీ త‌న ముఖానికి మాస్క్ ధరించారు. తాజాగా అదే పిక్‌ను తన ట్విట్ట‌ర్ ప్రొఫైల్ పిక్‌గా మోదీ అప్‌లోడ్ చేశారు. కరోనా వైరస్ నివారించడానికి లాక్‌డౌన్‌ను దేశ‌వ్యాప్తంగా మే 3వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన అనంత‌రం మోదీ త‌న ప్రొఫైల్ పిక్‌ను మార్చారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే ప్ర‌తి ఒక్క‌రు మాస్క్ ధ‌రించాల‌న్న సందేశాన్ని ఇస్తూ.. మోదీ తన ప్రొఫైల్ పిక్ ను ఛేంజ్ చేయడం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story