కందుకూరి వీరేశలింగం ఆంధ్రులకు ఆద్యుడు: నారా లోకేష్

X
By - TV5 Telugu |16 April 2020 7:39 PM IST
కందుకూరి వీరేశలింగం తెలుగుజాతి గర్వించదగిన మహనీయుడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
‘‘తెలుగుజాతి గర్వించదగిన మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులుగారు. సంఘ సంస్కరణ, లింగ సమానత్వం కోసం చేసిన పోరాటం, తెలుగు సాహితీ సేవ... ఇలా అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు. ఈరోజు వీరేశలింగం జయంతి సందర్భంగా ఆ నవయుగ వైతాళికుని సమాజసేవను మననం చేసుకుందాం’’ అని లోకేష్ ట్వీట్లో పేర్కొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com