జపాన్లో ఎమర్జెన్సీ పొడిగింపు
By - TV5 Telugu |17 April 2020 4:12 PM GMT
జపాన్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఇప్పటికే 150 మంది మృతి చెందారు. ఇక కరోనా కేసుల సంఖ్య 9,000 దాటింది. ఈ నేపథ్యంలో జపాన్ ప్రధాని షింజో ఆబె ఎమర్జెన్సీని పొడిగించారు. టోక్యోతోపాటు మరో ఆరు నగరాల్లో విధించిన ఎమర్జెన్సీని పొడిగిస్తున్నట్లు షింజో ఆబె వెల్లడించారు. ఈ ఎమర్జెన్సీ మే 6వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com