కరోనాతో మరో నలుగురు వైద్య సిబ్బంది మృతి
By - TV5 Telugu |18 April 2020 8:21 PM GMT
ఇంగ్లండ్లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ మహమ్మారి కారణంగా దేశంలో వైరస్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ ప్రాణాంతకర వైరస్ బారిన పడి ఇప్పటికే చాల మంది మృతి చెందారు. తాజాగా మరో నలుగురు వైద్య సిబ్బంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
కరోనా బాధితులకు అవిశ్రాంతంగా వైద్య సేవలు అందిస్తున్న నలుగురు వైద్య సిబ్బంది కరోనా బారిన పడి మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో 54 మంది వైద్య సిబ్బంది మృతి చెందారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com