కరోనాతో మరో నలుగురు వైద్య సిబ్బంది మృతి

కరోనాతో మరో నలుగురు వైద్య సిబ్బంది మృతి

ఇంగ్లండ్‌లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ మహమ్మారి కారణంగా దేశంలో వైరస్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ ప్రాణాంతకర వైరస్ బారిన పడి ఇప్పటికే చాల మంది మృతి చెందారు. తాజాగా మరో నలుగురు వైద్య సిబ్బంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

కరోనా బాధితులకు అవిశ్రాంతంగా వైద్య సేవలు అందిస్తున్న నలుగురు వైద్య సిబ్బంది కరోనా బారిన పడి మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో 54 మంది వైద్య సిబ్బంది మృతి చెందారు.

Tags

Read MoreRead Less
Next Story