స్పెయిన్‌లో 2 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

స్పెయిన్‌లో 2 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

స్పెయిన్‌లో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకి అక్కడ కేసుల సంఖ్య బారీగా పెరుగుతోంది. స్పెయిన్ లో కరోనా బారిన పడినవారి సంఖ్య రెండు లక్షలు దాటింది. సోమవారం కొత్తగా 4,266 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం ఒక్క రోజే కరోనా బారిన పడి 399 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 20,852కు చేరింది. ప్రపంచంలో అమెరికా తరువాత అత్యధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులున్న రెండో దేశం స్పెయినే కావడం గమనార్హం. ప్రస్తుతం స్పెయిన్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 200210కి చేరింది.

Tags

Read MoreRead Less
Next Story