కర్నూలు జిల్లాలో కరోనా కలకలం.. ఒక్కరోజే 31 కేసులు నమోదు

X
TV5 Telugu23 April 2020 7:22 PM GMT
ఏపీలో కరోనా స్వైర విహారం చేస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇక కర్నూలు జిల్లాను ఈ ప్రాణాంతకర కరోనా అతలాకుతలం చేస్తోంది. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ వేగంగా పెరుగుతోంది. గురువారం కొత్తగా 31 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 234కు చేరింది. కర్నూలు జిల్లాలో గురువారం ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. దీంతో జిల్లాలో మొత్తం మృతుల సంఖ్య ఏడుకు చేరింది.
Next Story