ఇండియాలో కరోనా బారిన పడి 24 గంటల్లోనే 37 మంది మృతి

ఇండియాలో కరోనా బారిన పడి 24 గంటల్లోనే 37 మంది మృతి

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ప్రాణాంతకర వైరస్ కారణంగా 24 గంటల్లోనే 37 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు 718 మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ వ్యాప్తంగా కొత్తగా 1684 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 23 వేలు దాటింది.

Tags

Read MoreRead Less
Next Story