దోమ వల్ల కరోనా ఏందయ్యా?.. బిగ్‌బిపై నెటిజన్ల విమర్శలు

దోమ వల్ల కరోనా ఏందయ్యా?.. బిగ్‌బిపై నెటిజన్ల విమర్శలు

దోమ గురించి ట్వీట్ చేసి.. సోషల్ మీడియా వేదికగా బిగ్‌బి అమితాబ్ బచ్చన్ విమర్శల పాలు అవుతున్నారు. అన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించిన వ్యక్తి అంత అవగాహనా రాహిత్యంగా మాట్లాడటం సరికాదని మండిపడుతున్నారు. ఓ దోమ తన గదిలోకి దూరిందని.. విచ్చలవిడిగా సంచరిస్తున్న ఆ కరోనా వైరస్ తనను ఒంటరిగా ఉండనీయడం లేదంటు ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. దోమ వల్ల కరోనా వ్యాపించదని ప్రూవ్ చేస్తూ.. ఓ ఐఎఫ్ఎస్ అధికారి కౌంటర్ ఇచ్చారు. దోమ ఏం శత్రువు కాదని, దోమ వల్ల కరోనా వైరస్ వ్యాపించదని బిగ్‌బి గుర్తించాలని మరో నెటిజన్ రీ ట్వీట్ చేశారు. ఇలా బిగ్‌బి ట్వీట్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story