పుణేలో కరోనా విలయతాండవం

X
By - TV5 Telugu |27 April 2020 1:37 AM IST
మహారాష్ట్రలోని ముంబై తరువాత పుణెలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. గడిచిన 12 గంటల్లోనే 49 కొత్త కేసులు నమోదైనట్లు జిల్లా ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు పుణేలో 979 కేసులు నమోదయ్యాయని జిల్లా ఆరోగ్య శాఖ తెలిపింది. అటు మహారాష్ట్రలో కూడా అధిక కేసులు నమోదవుతూ.. దేశంలో వేగంగా కరోనా విస్తరిస్తున్న రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉంది. దీంతో అధికార యంత్రాంగం కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ముంబై, పూణే నగరాల్లో కొన్ని ప్రాంతాలలో లాక్ డౌన్ పొడిగించే ఆలోచనలో ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com