కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి సెక్యూరిటీకి కరోనా పాజిటివ్
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి సామన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవరిని వదలటం లేదు. ఇప్పటికే పలువురు వైద్యులు, పోలీసు అధికారులు వైరస్ బారిన పడ్డారు. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిని సైతం కరోనా భయం వెంటాడుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ సెక్యూరిటీకి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో అతడిని అధికారులు ఎయిమ్స్కు తరలించారు. అతడితో కలిసిన వారిని, కలిసి పనిచేసిన సిబ్బందిని సెల్ఫ్ క్వారంటైన్ విధించారు. వైద్యాధికారులు మంత్రి కార్యాలయాన్ని, ఓఎస్డీ కార్యాలయాన్ని పూర్తిగా సానిటైజ్ చేశారు. బాధితులు మంత్రి కార్యాలయంలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ టీచింగ్ బ్లాక్లో మంత్రికి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతడు ఇంకా ఎవరెవరిని కాలిసి ఉంటాడనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com