కరోనా పరీక్షల సంఖ్య పెంచాలి: రాహుల్ గాంధీ

కరోనా పరీక్షల సంఖ్య పెంచాలి: రాహుల్ గాంధీ

కరోనాను ఓడించాలంటే.. టెస్టుల సంఖ్య పెంచాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చెప్పారు. కరోనాను దెబ్బతీయాలంటే మాస్ రాండమ్ టెస్టింగ్ చాలా ముఖ్యమని నిపుణులు అంగీకరిస్తున్నారని ట్వీటర్ వేదికగా తెలిపారు. ప్రస్తుతం రోజుకు 40 వేల పరీక్షలు జరుగుతున్నాయని.. కేసుల సంఖ్య పెంచాలంటే కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. వాటిని అధిగమించి.. రోజుకి లక్ష పరీక్షలు జరిపించాలని అన్నారు. పరీక్షలు చేయడానికి తగినన్ని కిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story