మే చివరి వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
By - TV5 Telugu |30 April 2020 8:22 PM GMT
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కరోనాకు అడ్డుకట్ట వేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. మే చివరివరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కరోనా ప్రభావం తగ్గటం లేదు. దీంతో.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చిన్న దుకాణాలు, ఎంపిక చేసిన గ్రీన్ జోన్లలో మాత్రమే వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం ఇస్తామని.. మిగతా రాష్ట్రమంతా మే చివరి వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని బెంగాల్ ప్రభుత్వం తెలిపింది. కరోనా కట్టడికి ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com