రష్యా ప్రధాని కోలుకోవాలి: మోదీ

X
By - TV5 Telugu |1 May 2020 11:06 PM IST
కరోనా బారినపడ్డ రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్టిన్ త్వరగా కోలుకోవాలని భారత్ ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు మోడీ ట్వీట్ చేశారు. ప్రపంచ దేశాలు మూకుమ్మడిగా.. కరోనాతో పోరాటం చేస్తున్నాయి. కానీ, ఈ మహమ్మారి దాటికి పలు దేశాలను అతలాకుతలం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కరోనా పరీక్షలు చేసుకున్న రష్యా ప్రధానికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన కోలుకోవాలని మోడీ అన్నారు. ఇటీవల బ్రిటన్ ప్రధాని కూడా కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com