మే 17 వరకు రైలు ప్రయాణాలు రద్దు.. కానీ..

మే 17 వరకు రైలు ప్రయాణాలు రద్దు.. కానీ..

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్రం మే 17 వరకు లాక్ డౌన్ పొడిగించడంతో భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల కోసం రైల్వే సేవలను కూడా 17 వరకు రద్దు చేసింది.

అయితే.. పలు ప్రాంతాలలో చిక్కుకుపోయిన వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులను తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వాల కోరిక మేరకు ప్రత్యేక రైళ్లు నడిపిస్తామని స్పష్టం చేసింది.

సరుకుల రవాణాకు రైల్వే కార్యకలాపాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story