కరోనా విషయంలో యూరప్ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు

X
By - TV5 Telugu |2 May 2020 1:12 AM IST
కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని యూరప్ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. కరోనా ప్రభావం ఎక్కువగా యూరప్ దేశాలపై పడింది. స్పెయిన్, ఇటలీ లాంటి దేశాలు బాగా నష్టపోయాయి. అవి ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్నాయి. అయితే.. కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. యూరప్ దేశాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తుందని డబ్ల్యూహెచ్ఓ యూరప్ అధ్యక్షుడు హాన్స్ క్లూగ్ అన్నారు. తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తున్నా.. అవకాశం ఉన్న ప్రతీ చోటా అది తిరగబడుతుందని అన్నారు. ఈ సారి దానిని ఎదుర్కొవాడానికి అన్ని దేశాలు సిద్ధంగా ఉండాలని సూచించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com